Telangana: కరోనా అప్ డేట్: తెలంగాణలో తాజాగా 7 కేసులు నమోదు

Seven more cases in Telangana today

  • యాక్టివ్ కేసుల సంఖ్య 658
  • ఇప్పటివరకు 25 మంది మృతి
  • 307 మంది డిశ్చార్జి

తెలంగాణలో ఇవాళ కొత్తగా మరో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 6 కేసులు గుర్తించారు. మరో కేసు వరంగల్ అర్బన్ జిల్లాకు చెందినది. యాక్టివ్ కేసుల సంఖ్య 658కి పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 990కి చేరింది. ఇప్పటివరకు 307 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 25 మంది మరణించారు. ఇవాళ 16 మందిని డిశ్చార్జి చేశారు. అటు, ఏపీలోనూ కరోనా కేసులు మరింత తీవ్రమయ్యాయి. గడచిన 24 గంటల్లో 61 కొత్త కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News