Corona Virus: ఆంధ్రప్రదేశ్‌లో మరో 35 మందికి కరోనా నిర్ధారణ.. కర్నూలులో అత్యధికంగా 184 కేసులు

coronavirus cases in ap

  • ఏపీలో మొత్తం 757 పాజిటివ్ కేసులు
  • 96 మంది డిశ్చార్జ్
  • 22 మంది మృతి
  • చికిత్స పొందుతున్నవారి సంఖ్య 639

రాష్ట్రంలో గత 24 గంటల్లో 35 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్‌ సర్కారు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 757 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. వారిలో 96 మంది డిశ్చార్జ్ అయ్యారని, 22 మంది మరణించారని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 639 అని వివరించింది. 24 గంటల్లో కర్నూలు జిల్లాలో కొత్తగా 10,  కడప జిల్లాలో ఆరు, అనంతపురం జిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో తొమ్మిది, కృష్ణా జిల్లాలో మూడు, పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో అత్యధికంగా 184 కేసులు నమోదు కాగా, వారిలో 175 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఐదుగురు మృతి చెందగా, నలుగురు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా 158 కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు చెప్పింది. గుంటూరులో 137 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, 15 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.  

ఈ రెండు జిల్లాల తర్వాత అత్యధికంగా కృష్ణా జిల్లాలో 83 మందికి కరోనా సోకగా, 63 మందికి చికిత్స అందుతోంది.. 14 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో 67 కేసులు నమోదు కాగా, 64 మందికి చికిత్స అందుతోంది. ఇద్దరు కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు.
 
చిత్తూరు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 53కి చేరింది. ప్రకాశం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఏయే జిల్లాల్లో ఎన్ని కేసులు..?                                                                                                                        
                                   
               

  • Loading...

More Telugu News