Corona Virus: ఏపీలో పెరిగిన కేసులు.. మరో 75 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ!

coronavirus cases in ap

  • ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 722 పాజిటివ్ కేసులు
  • 92 మంది డిశ్చార్జ్
  • 20 మంది మృతి
  • కర్నూలులో అత్యధికంగా 174 కేసులు  

రాష్ట్రంలో గత 24 గంటల్లో 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 722 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. వారిలో 92 మంది డిశ్చార్జ్ అయ్యారని, 20 మంది మరణించారని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 610 అని వివరించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో అత్యధికంగా 174 కేసులు నమోదు కాగా, వారిలో 168 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఐదుగురు మృతి చెందగా, ఒకరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా 149 కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు చెప్పింది. గుంటూరులో 130 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, 15 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  

ఈ రెండు జిల్లాల తర్వాత అత్యధికంగా కృష్ణా జిల్లాలో 80 మందికి కరోనా సోకగా, 60 మందికి చికిత్స అందుతోంది.. 14 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో 67 కేసులు నమోదు కాగా, 65 మందికి చికిత్స అందుతోంది.

ఒకరు డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  చిత్తూరులో 24 గంటల్లో 25 మందికి కరోనా నిర్ధారణ కావడంతో ఆ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 53కి చేరింది. ప్రకాశం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఏయే జిల్లాల్లో ఎన్ని కేసులు..?                                                                                                

  • Loading...

More Telugu News