Corona Virus: ఏపీలో మరో 31 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

coronavirus cases in ap

  • ఇప్పటివరకు మొత్తం 603 పాజిటివ్ కేసులు 
  • 42 మంది డిశ్చార్జ్
  • 15 మంది మృతి
  • కర్నూలులో అత్యధికంగా 129 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. 24 గంటల్లో ఏపీలో 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 603 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించింది. వారిలో 42 మంది డిశ్చార్జ్ కాగా, 15 మంది మరణించారని పేర్కొంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 546గా తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో అత్యధికంగా 129 కేసులు నమోదు కాగా, వారిలో 126 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇద్దరు మృతి చెందగా, ఒకరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా 126 కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు చెప్పింది. గుంటూరులో 122 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  

ఈ రెండు జిల్లాల తర్వాత అత్యధికంగా నెల్లూరులో 67 కేసులు నమోదు కాగా, 64 మందికి చికిత్స అందుతోంది. ఒకరు డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఏయే జిల్లాల్లో ఎన్ని కేసులు..?             
                                

  • Loading...

More Telugu News