Naga Shaurya: నాగశౌర్య కొత్త ప్రాజెక్టుపై సందేహాలు!

 Nagasouryas latest film shelved

  • అంతగా ఆదరణ పొందని 'అశ్వద్ధామ'
  • పూజ జరుపుకున్న లక్ష్మీ సౌజన్య ప్రాజెక్టు 
  • దర్శక నిర్మాతల మధ్య అభిప్రాయ భేదాలు

ఇటీవల వచ్చిన నాగ శౌర్య సినిమా 'అశ్వద్ధామ' ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు సినిమాలు వున్నాయి. అయితే, వాటిలో ఒక ప్రాజెక్టు ఆగిపోయిందనే వార్త వినిపిస్తోంది.

నాగశౌర్య కథానాయకుడిగా లక్ష్మీ సౌజన్య ఒక సినిమాను రూపొందించడానికి రంగంలోకి దిగింది. ఈ సినిమాలో కథానాయికగా రీతూ వర్మను ఎంపిక చేసుకున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. అయితే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనేది తాజా సమాచారం. దర్శక నిర్మాతల మధ్య తలెత్తిన విభేదాలే అందుకు కారణమని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

  • Loading...

More Telugu News