Pawan Kalyan: రేపు రాజధాని గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటన

Pawan to visit Amaravathi villages tomorrow

  • అమరావతి రైతులు, మహిళలతో మాట్లాడనున్న జనసేనాని
  • మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి పర్యటన షురూ
  • ఎర్రబాలెం మీదుగా తుళ్లూరు వరకు పర్యటన
  • ఆదివారం వరుస సమావేశాలతో పవన్ బిజీ

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు మంగళగిరి కార్యాలయం నుంచి పవన్ పర్యటన ప్రారంభం కానుంది. ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు. అనంతవరం గ్రామాల్లో పవన్ పర్యటన సాగుతుంది. తన పర్యటనలో భాగంగా జనసేనాని రాజధాని ప్రాంత రైతులు, మహిళలతో మాట్లాడనున్నారు. ఈ మేరకు పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కాగా, ఆదివారం కూడా పవన్ పార్టీ కార్యక్రమాలతో బిజీగా వుంటారు. ఉదయం 10 గంటలకు రేపల్లె జనసైనికులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లిగూడెం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఆపై, జనసేన న్యాయ విభాగం సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.

  • Loading...

More Telugu News