Sensex: మళ్లీ విధులకు హాజరవుతున్న చైనా ఉద్యోగులు, కార్మికులు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex closes in green

  • 237 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 79 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3 శాతం వరకు పెరిగిన ఎన్టీపీసీ షేర్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. చైనా పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు నెమ్మదిగా మళ్లీ విధుల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 237 పాయింట్లు లాభపడి 41,216కి పెరిగింది. నిఫ్టీ 79 పాయింట్లు పుంజుకుని 12,110కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.95%), మారుతి సుజుకి (2.04%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.84%), బజాజ్ ఆటో (1.52%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.39%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.34%).

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-0.86%), భారతి ఎయిర్ టెల్ (-0.76%), నెస్లే ఇండియా (-0.61%), టీసీఎస్ (-0.52%), సన్ ఫార్మా (-0.39%).

  • Loading...

More Telugu News