Andhra Pradesh: తొలగించిన పెన్షన్ల రీవెరిఫికేషన్ కు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం

  • పెన్షన్ ఖాతాలు తొలగించారంటూ ఏపీలో విమర్శలు
  • స్పందించిన జగన్ సర్కారు
  • రేపటి నుంచి 4.80 లక్షల ఖాతాల వెరిఫికేషన్ కు నిర్ణయం

ఏపీలో భారీ సంఖ్యలో పెన్షన్లు తొలగించారంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. తొలగించిన పెన్షన్ ఖాతాల రీవెరిఫికేషన్ జరపాలంటూ అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో రేపటి నుంచి 4.80 లక్షల పెన్షన్ ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలగించిన వారిలో ఎవరైనా అర్హులు ఉన్నట్టు గుర్తిస్తే వారికి గత నెల పెన్షన్ తో కలిపి మొత్తం రెండు నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించారు.

Andhra Pradesh
Pentions
Reverification
Jagan
YSRCP
  • Loading...

More Telugu News