Jagan: ఇంత మోసకారి కాబట్టే 12 ఛార్జిషీట్లలో ఇప్పటికీ 420 సెక్షన్ కింద విచారణ ఎదుర్కొంటున్నారు: చంద్రబాబు

  • పింఛను అర్హత వయసు ఐదేళ్లు తగ్గిస్తే, ఉన్న పింఛన్లు ఇంకా పెరగాలి
  • కానీ, తగ్గడం వింతగా ఉంది
  • ఏమిటీ జగన్మాయ 
  • మోసాలు చేయడం మాత్రం మానుకోవట్లేదు

'7 లక్షల పెన్షన్లు ఔట్‌' అంటూ ఏపీలో పరిస్థితిని వివరిస్తూ ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోస్టు చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  'పింఛను అర్హత వయసు ఐదేళ్లు తగ్గిస్తే, ఉన్న పింఛన్లు ఇంకా పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉంది. ఏమిటీ జగన్మాయ. 8 నెలల్లో 7 లక్షల పింఛన్లకు కోత పెట్టడం, పండుటాకులను మోసం చేయడం కాదా? 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి మహిళలకు పింఛను ఇస్తామని హామీ ఇచ్చి ఏమార్చడం మోసం కాదా?' అని చంద్రబాబు ప్రశ్నించారు.
 
'కేంద్రం ఇచ్చిన రూ.6 వేలకు అదనంగా రూ.12,500 ఇస్తామని చెప్పి, రైతులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి రద్దు చేసి యువతకు టోపి పెట్టారు. ఇంత మోసకారి కాబట్టే 12 చార్జిషీట్లలో ఇప్పటికీ 420 సెక్షన్ కింద విచారణ ఎదుర్కొంటున్నారు. అయినా మోసాలు చేయడం మాత్రం మానుకోవట్లేదు' అని అన్నారు. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ ఇలా చేయడం అన్యాయమని చంద్రబాబు విమర్శించారు.

  • Loading...

More Telugu News