Telugudesam: ముగిసిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

  • దాదాపు 12 అంశాలపై చర్చించినట్టు సమాచారం
  • అమరావతి, 3 రాజధానులు తదితర అంశాలపై చర్చ
  • కాసేపట్లో మీడియా సమావేశం 

విజయవాడలో నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది.  ఈ సమావేశానికి గల్లా జయదేవ్, రామ్మోహన్‌ నాయుడు, తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో దాదాపు 12 అంశాలపై చర్చించినట్టు సమాచారం. అమరావతి, మూడు రాజధానులు, పోలవరం ప్రాజెక్టు, మీడియా, టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు, సీఏఏ, ఎన్ఆర్సీ, కేంద్ర బడ్జెట్ తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం వివరాలను కాసేపట్లో నిర్వహించనున్న మీడియా సమావేశంలో టీడీపీ నేతలు వివరించనున్నారు.

  • Loading...

More Telugu News