Nirbhaya: నిర్భయ దోషి ముకేశ్ సింగ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  • ఉరికంబానికి ఎక్కబోయే ఖైదీ వేసిన పిటిషన్ కంటే మరేదీ ముఖ్యం కాదు
  • ఈ పిటిషన్‌కే ప్రాధాన్యం
  • స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం

‘నిర్భయ’ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురిలో ఒకడైన ముకేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ముకేశ్ సింగ్ సుప్రీంలో తాజాగా పిటిషన్ దాఖలు చేశాడు. ఈ వ్యాజ్యంపై సుప్రీం స్పందిస్తూ.. త్వరలో ఉరికంబానికి ఎక్కబోయే ఖైదీ వేసిన పిటిషన్ కంటే మరేదీ ముఖ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ అప్పీలుకు ప్రాధాన్యం ఇస్తామని చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నిన్న స్పష్టం చేసింది. ముకేశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేటి మధ్యాహ్నం 12:30 గంటలకు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

 నిజానికి నిర్భయ దోషులను ఈ నెల 22నే ఉరి తీయాల్సి ఉండగా, ముకేశ్ సింగ్ సుప్రీంను ఆశ్రయించడంతో ఉరి వాయిదా పడి ఫిబ్రవరి 1కి మారింది. తీహార్ జైలులో ఉరికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముకేశ్ సింగ్ మరోమారు సుప్రీంను ఆశ్రయించడంతో శిక్ష అమలుపై సందిగ్ధత నెలకొంది.

Nirbhaya
Mukesh kumar singh
Supreme Court
  • Error fetching data: Network response was not ok

More Telugu News