Chandrababu: కడపలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

  • ఏడు రోడ్ల కూడలి వద్ద దిష్టిబొమ్మ దహనం
  • చంద్రబాబు సీమ ద్రోహి అంటూ నినాదాలు
  • కర్నూలులో టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన వైసీపీ విద్యార్థులు

టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మను వైసీపీ శ్రేణులు దగ్ధం చేశాయి. కడపలోని ఏడు రోడ్ల కూడలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. శాసనమండలిలో టీడీపీ తీరును నిరసిస్తూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.

మరోవైపు కర్నూలులో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని వైసీపీ విద్యార్థి విభాగానికి చెందిన విద్యార్థులు ముట్టడించారు. వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకున్న టీడీపీకి వ్యతిరేకంగా ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. టీడీపీ కార్యాలయం ముందు రాస్తారోకో చేశారు. దీంతో, అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది.

  • Loading...

More Telugu News