Police: జగన్ ను ఫేస్ బుక్ లో అసభ్యంగా దూషించాడంటూ... వ్యక్తిపై కేసు నమోదు!

  • సోషల్ మీడియాలో అసభ్య వీడియో
  • పుష్పశ్రీవాణి, రోజాలపైనా వ్యాఖ్యలు
  • కేసును విచారిస్తున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ను సోషల్ మీడియా ద్వారా అసభ్య పదజాలంతో దూషించాడంటూ ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా వింజమూరు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సీఎంను దూషించారంటూ రావిపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దంతులూరి రఘు ఓ ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు మండలంలోని బిల్లుపాటి రవిపై కేసు నమోదు చేశారు.

ఈ నెల8న తన ఫేస్ బుక్ లో ఓ వీడియోను అప్ లోడ్ చేసిన రవి, జగన్, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యే రోజాలను అసభ్యంగా దూషించాడని నిర్దారించారు. దీంతో రవిపై కేసును రిజిస్టర్ చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని వెల్లడించారు.

Police
Jagan
Roja
Pushpa Srivani
Facebook
Social Media
Case
  • Loading...

More Telugu News