Guntur District: గుంటూరులో హైటెక్ వ్యభిచార ముఠాకు సంకెళ్లు.. కీలక సూత్రధారి బీటెక్ స్టూడెంట్!

  • తాను మోసపోవడంతో తనలా మరికొందరిని మోసం చేయాలని భావించిన నిందితుడు
  • మరికొందరితో కలిసి వ్యభిచార ముఠా
  • జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని కాలేజీ అమ్మాయిల పేర్లు

గుంటూరులో గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న హైటెక్ వ్యభిచార ముఠాకు పోలీసులు సంకెళ్లు వేశారు. ఈ ముఠాలోని కీలక నిందితుడు బీటెక్ విద్యార్థి కావడం గమనార్హం. అతడు తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో యాప్‌ను తయారుచేసి దాని ద్వారా ఈ దందా నిర్వహిస్తుండడం చూసి పోలీసులు విస్తుపోయారు. మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన నిడిగొండ వీరబ్రహ్మం, ఫిరంగిపురం మండలం వేములూరుపాడుకు చెందిన ఉప్పల థామస్‌కుమార్‌,  చేబ్రోలుకు చెందిన భూపతి నాగేశ్వరరావు, పాత గుంటూరులోని బాలాజీ నగర్‌కు చెందిన నల్లపాటి అశోక్‌కుమార్‌లను మీడియా ఎదుట హాజరు పరిచిన పోలీసులు వివరాలు వెల్లడించారు.

పాలిటెక్నిక్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన వీరబ్రహ్మం.. ఈ-సెట్‌లో 2 వేల ర్యాంకు సాధించి గుంటూరులో బీటెక్‌లో చేరాడు. ప్రస్తుతం 4వ సంవత్సరం చదువుతున్నాడు. వీరబ్రహ్మం ఓసారి ఓ యాప్ ద్వారా కాల్ గాళ్స్ కోసం వెతికాడు. ఈ క్రమంలో  రవి అనే వ్యక్తి పరిచయమై అతడి నుంచి రూ.30 వేలు తీసుకుని హైదరాబాద్‌ పంపాడు. అక్కడికి వెళ్లాక ఎవరూ లేకపోవడంతో అనుమానంతో రవికి ఫోన్ చేశాడు. అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.

ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో తాను కూడా ఇలా మోసం చేయవచ్చని భావించాడు. తన నంబరును కూడా ఆన్‌లైన్‌లో పెట్టి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయడం ప్రారంభించాడు. గత రెండేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుగా సాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల తల్లితో వీరబ్రహ్మానికి పరిచయం అయింది. ఆమెతో ఉంటూ థామస్ కుమార్‌తో కలిసి పాత గుంటూరులోని నంది వెలుగు రోడ్డులో గది అద్దెకు తీసుకుని వ్యభిచారం దందాకు తెరలేపారు.

ప్రతి రోజు యువతులు, యువకులు వచ్చి వెళ్తుండడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టు అయింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఓ యువతి కూడా ఉంది. కాగా, వీరబ్రహ్మం వద్ద ఉన్న మహిళల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన కాలేజీ అమ్మాయిల పేర్లు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News