Rape: మీ అవ్వ చనిపోయిందని చెప్పి తీసుకెళ్లి.. వివాహితపై అత్యాచారం!

  • చిత్తూరు జిల్లాలో ఘటన
  • స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన యువకుడు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

"మీ అవ్వ చనిపోయింది. నువ్వు వెంటనే రావాలి" అంటూ ఓ వివాహితను మభ్యపెట్టిన వ్యక్తి, ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలంలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలను మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం, ముష్టూరు పంచాయతీకి చెందిన ఒక వివాహిత మహిళ, పొరక ఊసలు సేకరించేందుకు పొలాల్లోకి వెళ్లింది. అదే సమయంలో పిట్టా వాండ్లపల్లె సమీపంలోని వడ్డిపల్లెకు చెందిన ఉప్పుతోళ్ల మహేశ్ అతని స్నేహితులు విజయ్, శివ టూ వీలర్లపై అక్కడికి వెళ్లారు.

ఆమెతో మీ అవ్వ చనిపోయిందని, నిన్న తీసుకుని రమ్మన్నారని చెప్పారు. బాధితురాలు ఏడుస్తూ, మహేశ్ బైక్ పైకి ఎక్కింది. సమీపంలోని కొండవైపు తీసుకెళ్లిన మహేశ్, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని స్నేహితులు కూడా ఆమెను రేప్ చేశారు. ఆపై బోయకొండ ఆర్చి వరకూ తీసుకెళ్లి వదిలిపెట్టి పారిపోయారు. బాధితురాలు ఇంటికి వెళ్లి, కుటుంబీకులకు విషయం చెప్పగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News