Kamal Haasan: పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కమలహాసన్ పార్టీ

  • పౌరసత్వ చట్ట సవరణ చేసిన కేంద్రం
  • వ్యతిరేకిస్తున్న ఎంఎన్ఎం
  • సుప్రీంకోర్టులో పిటిషన్

కమలహాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వం చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పౌరసత్వ చట్టంలోని సవరణలు మతపరమైన మైనారిటీలకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నాయని, ఈ చట్టం ద్వారా భాషాపరమైన మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ ఎంఎన్ఎం పిటిషన్ దాఖలు చేసింది. ఈ తరహా చట్టం రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించడంలేదని, మతం ఆధారంగా ప్రజలను వర్గీకరించడం సరైన చర్య కాదని ఎంఎన్ఎం తన పిటిషన్ లో పేర్కొంది. పౌరసత్వ చట్టం అమలుయోగ్యం కాదంటూ ఆదేశాలు ఇవ్వాలని ఎంఎన్ఎం తన పిటిషన్ లో సుప్రీంకు విజ్ఞప్తి చేసింది.

Kamal Haasan
Supreme Court
CAA
MNM
India
NDA
  • Loading...

More Telugu News