Disha: ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో 12 బుల్లెట్లు రికవరీ చేసిన పోలీసులు

  • దిశను హత్య చేసిన నిందితుల ఎన్ కౌంటర్
  • తెల్లవారుజామున 3 గంటల నుంచి 5.30 గంటల మధ్య ఎన్ కౌంటర్
  • తెలంగాణ పోలీసులపై ప్రశంసలు జల్లు

దిశను అత్యంత పాశవికంగా హత్యాచారం చేసిన నలుగురు నిందితులను ఈ తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దిశను హత్య చేసిన స్థలంలో సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వి, వారి ఆయుధాలను లాక్కొనేందుకు నిందితులు యత్నించారు.

ఈ నేపథ్యంలో, ఆత్మరక్షణ కోసం నిందితులను పోలీసులు కాల్చిచంపారు. ఈ తెల్లవారుజామున 3 గంటల నుంచి 5.30 గంటల మధ్య ఈ ఎన్ కౌంటర్ జరిగింది. దుర్మార్గులను చంపిన తెలంగాణ పోలీసులపై దేశ నలు మూలల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. మరోవైపు, ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో పోలీసులు బుల్లెట్లను రికవర్ చేశారు. మొత్తం 12 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గన్స్ ను క్లూస్ టీమ్ సీజ్ చేసింది.

  • Loading...

More Telugu News