Suryapet: అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి

  • సూర్యాపేటలో భానుమతి అనే విద్యార్థిని మృతి
  • బీటెక్ సెకండియర్ చదువుతున్న భానుమతి
  • స్థానిక ఎస్టీ హాస్టల్ లో ఉంటున్న మృతురాలు

ఇటీవలి కాలంలో వివిధ కారణాలతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం కలవరపెడుతోంది. తాజాగా తెలంగాణలోని సూర్యాపేటలో ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. బీటెక్ సెకండియర్ చదువుతున్న ధరావత్ భానుమతి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈమె స్వస్థలం కోదాడ మండలం భోజ్యగూడెం. బీటెక్ చదువుతున్న భానుమతి స్థానికంగా ఉన్న ఎస్టీ హాస్టల్ లో ఉంటోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News