Disha: దేశం మొత్తాన్ని కలచివేసింది: 'దిశ' హత్యాచార ఘటనపై రాజ్యసభలో చర్చ

  • సమస్యలను మూలాల నుంచి తొలగించాలి
  • నిందితులను కఠినంగా శిక్షించాలి
  • సామాజిక సంస్కరణ జరగాలి
  • తమ అభిప్రాయాలను తెలిపిన ఎంపీలు

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన 'దిశ' హత్యాచార ఘటనపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసిందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. కేవలం చట్టాలు చేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలపై దాడుల వంటి సమస్యలను మూలాల నుంచి తొలగించడానికి సమాజం నిలబడాలని వ్యాఖ్యానించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు.  

దిశ హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు జరగకుండా సామాజిక సంస్కరణ జరగాలని దేశంలోని న్యాయ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను తాను కోరుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అమీ యజ్ఞిక్ అన్నారు.

  • Loading...

More Telugu News