rtc: రెండు వార్తా పత్రికలపై ఫిర్యాదు చేశాను.. నాపై రాసిన వార్తలు నిజమని రెండు రోజుల్లో నిరూపించాలి: రాజిరెడ్డి

  • దినపత్రికల్లో అసత్య వార్తలను ప్రచురించారు
  • నా పేరున బస్సులు, ఇతర వ్యాపారాలు ఉన్నట్లు రుజువు చేయాలి 
  • ఆర్టీసీలో బినామీగా వ్యాపారం చేస్తున్నట్లు పత్రికల్లో ప్రచురించారు

తన గురించి రెండు దినపత్రికల్లో అసత్య వార్తలను ప్రచురించారని ఆర్టీసీ ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మండిపడ్డారు. ఆ వార్తలను ఖండిస్తున్నానని తెలిపారు. తన కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యాపారం వాస్తవమే కానీ తనకు వాటితో ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.

తన పేరున బస్సులు, ఇతర వ్యాపారాలు ఉన్నట్లు వార్తల్లో ప్రచురించారని రాజిరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని రెండు రోజుల్లో ఆ పత్రికలు రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఆర్టీసీలో బినామీగా వ్యాపారం చేస్తున్నట్లు పత్రికల్లో ప్రచురించారని తెలిపారు.

తాను ఆ రెండు పత్రికలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఫిర్యాదు చేశానని రాజిరెడ్డి అన్నారు. ఆ రెండు దినపత్రికలపై చట్టపరమైన చర్యలకు ముందుకు వెళ్తానని చెప్పారు. తాను ప్రజారవాణా వ్యవస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నానన్నారు.

  • Loading...

More Telugu News