Guntur District: ‘టిక్ టాక్’పై మోజుతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం.. భార్యను హత మార్చిన భర్త!

  • గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
  • పొట్లూరులో వివాహితను హతమార్చిన భర్త
  • ఈ నెల 17న ఈ దారుణం జరిగినట్టు సమాచారం

గుంటూరు జిల్లా పొట్లూరులో వివాహితను భర్తే హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి స్థానికులు అందించిన వివరాల ప్రకారం, సువార్తమ్మ, నర్సయ్యగౌడ్ భార్యాభర్తలు. ‘టిక్ టాక్’ మోజులో పడి వివాహేతర సంబంధం పెట్టుకుందని తన భార్యపై నర్సయ్య గౌడ్ కు అనుమానం.

ఈ నేపథ్యంలో ఆమెతో తరచుగా గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో వారి మధ్య గొడవలు తార స్థాయికి చేరడంతో వాళ్లిద్దరూ విడిపోయారు. కుమార్తెను తన తల్లిదండ్రుల వద్ద వదిలేసిన సువార్తమ్మ, లేడీస్ హాస్టల్ లో చేరింది. సువార్తమ్మపై కక్ష పెంచుకున్న నర్సయ్య గౌడ్ ఆమెను హతమార్చేందుకు ఓ పన్నాగం పన్నాడు.

ఈ క్రమంలో, కలిసి కాపురం చేద్దామంటూ నమ్మబలికి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. అనంతరం నర్సయ్య గౌడ్ తన అన్న వెంకయ్యతో కలిసి సువార్తమ్మను హతమార్చాడు. తర్వాత, గ్రామ శ్మశానానికి ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి, పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు స్థానికుల సమాచారం.

  • Loading...

More Telugu News