suicide: గాజువాకలో విషాదం.. గదిలో విగతజీవులుగా ప్రేమ జంట!

  • ప్రేమించుకొని ఒంగోలుకు వెళ్లిపోయిన ప్రేమజంట
  • రెండు నెలల క్రితం తిరిగి విశాఖకు 
  • ఉరి వేసుకొని ఆత్మహత్య

ఆ యువతి, యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు.. జీవితాంతం కలిసి బతకాలని అనుకున్నారు. పెద్దలను ఎదిరించారు.. ఇటీవలే విశాఖ జిల్లా గాజువాకలోని కంఠయ్యనగర్ లో కాపురం పెట్టారు. అయితే, ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రోజు ఉదయం వారిద్దరూ తాము ఉంటోన్న గదిలోనే విగతజీవులుగా కనపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
 
ఆటోనగర్ లోని ఓ ప్రైవేటు ల్యాబ్ లో పనిచేసే నరేంద్రకుమార్ (22).. డిల్లేశ్వరి(19)ని ప్రేమించి, కొన్ని నెలల క్రితం ఒంగోలుకు తీసుకెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో రెండు నెలల క్రితం వారిద్దరు కంఠయ్యనగర్ కు వచ్చారు. ఈ రోజు తెల్లవారు జామ నుంచి వారు ఇంటి తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చి స్థానికులు తలుపులు తెరిచి చూడగా వారిద్దరూ ఉరివేసుకుని ఉండడాన్ని గమనించారు. వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

  • Loading...

More Telugu News