Pawan Kalyan: ప్రధాని కార్యాలయం దీనిని గమనిస్తుంది జగన్ రెడ్డి గారూ!: పవన్ కల్యాణ్ హెచ్చరిక

  • కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికేనా తెలుగు భాష
  • తెలుగు కోసం డబ్బు తెచ్చి ఇంగ్లీష్ కోసం ఖర్చు చేస్తారా?
  • ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ మండిపాటు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్రం నుంచి తెలుగు భాష కోసం డబ్బులు తీసుకుని ఇంగ్లీష్ కోసం ఖర్చు పెడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ట్వీట్లు పెట్టారు. కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకునేందుకు తప్ప, తెలుగు భాష మరెందుకూ పనికిరాకుండా పోయిందన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు సాగాయి.

"350 -ఏ... వాడి - అంటే తెలుగు కోసం డబ్బులు తీసుకొని, ఇంగ్లీషు కోసం ఖర్చుపెడతారా? ప్రధాని కార్యాలయం దీన్ని గమనిస్తుంది జగన్ రెడ్డి గారూ" అని పవన్ హెచ్చరించారు. అంతకుముందు "కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప , మనకి  తెలుగు భాష సరస్వతి దేనికి పనికిరాదన్న మాట...పార్లమెంటులో నరసాపురం పార్లమెంటు ‘వైసీపీ ఎంపీ’ -రఘురామకృష్ణంరాజు గారి మాటలు వింటే నాకే కాదు, ఎవరికైనా  అదే అనిపిస్తుంది" అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News