Indore Test: తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా.. పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్లా బ్యాట్స్ మెన్

  • 493/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా
  • ఓపెనర్లు ఇద్దరినీ బౌల్డ్ చేసిన ఉమేశ్, ఇశాంత్
  • 327 పరుగులు వెనుకబడి ఉన్న బంగ్లాదేశ్

ఇండోర్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. 6 వికెట్లకు 493 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. తద్వారా బంగ్లాదేశ్ పై తొలి ఇన్నింగ్స్ లో 343 ఆధిక్యాన్ని స్కోర్ బోర్డుపై ఉంచింది. నిన్న ఆట ముగిసే సమయానికి 493/6 స్కోరు మీదే ఉన్నప్పటికీ భారత్ డిక్లేర్ చేయలేదు. కానీ, ఈరోజు ఆటను కొనసాగించకుండానే డిక్లేర్ చేసింది.

మరోవైపు, భారత్ పేస్ బౌలర్లు ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ ల నిప్పులు చెరిగే బంతులకు బంగ్లా బ్యాట్స్ మెన్ తడబడుతున్నారు. 6 పరుగులు చేసిన ఇమ్రుల్ ను ఉమేశ్ యాదవ్ బౌల్డ్ చేసి బంగ్లా పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత 6 పరుగులు చేసిన మరో ఓపెనర్ షాద్మాన్ ఇస్లాంను ఇశాంత్ శర్మ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 16 పరుగులు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే బంగ్లా ఇంకా 327 పరుగులు వెనుకబడి ఉంది.

Indore Test
India
Bangladesh
Score Card
  • Loading...

More Telugu News