Sensex: లాభాల్లో నుంచి భారీ నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

  • 330 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 103 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • మూడున్నర శాతానికి పైగా లాభపడ్డ యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. మధ్యాహ్నం సమయంలో మార్కెట్లు లాభాల్లోకి వెళ్లినప్పటికీ... ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 330 పాయింట్ల నష్టంతో 40,323కు పడిపోయింది. నిఫ్టీ 103 పాయింట్లు కోల్పోయి 11,908కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (3.76%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.08%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.25%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (0.92%), టెక్ మహీంద్రా (0.27%).

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-4.23%), వేదాంత లిమిటెడ్ (-3.39%), ఓఎన్జీసీ (-2.64%), టీసీఎస్ (-2.54%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.41%).

  • Loading...

More Telugu News