Karimnagar District: కరీంనగర్‌లో దారుణం: పొలంలో గడ్డికోస్తున్న వివాహితపై అత్యాచారం.. హత్య

  • స్నేహితుడి భార్యపైనే అఘాయిత్యం
  • ఆపై ఫోన్ చేసి గ్రామస్థులకు చెప్పిన వైనం
  • పోలీసుల అదుపులో నిందితుడు

పొలంలో గడ్డికోస్తున్న వివాహితపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఆపై ఆమెను దారుణంగా మట్టుబెట్టాడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మాదాపూర్ శివారులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరుకు చెందిన ఓ వ్యక్తి, స్నేహితుడు చెక్కిల్ల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి నిన్న మధ్యాహ్నం మద్యం తాగాడు. అనంతరం తన బైక్‌ను శ్రీనివాస్‌‌గౌడ్‌కు ఇచ్చి తన భార్య పొలంలో గడ్డి కోస్తోందని, ఆ గడ్డిని ఇంటికి తీసుకురావాలని పంపాడు.

అలా వెళ్లిన శ్రీనివాస్.. పొలంలో ఒంటరిగా ఉన్న స్నేహితుడి భార్య (45)పై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసి ఆమె మెడలోని మూడు తులాల బంగారు మంగళసూత్రాన్ని తీసుకుని పరారయ్యాడు. వెళ్తూవెళ్తూ ఓ మహిళ పొలంలో మృతి చెంది పడి ఉందని గ్రామస్థులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పొలానికి చేరుకుని గాలించిన గ్రామస్థులకు మహిళ మృతదేహం కనిపించింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెజ్జంకి మండలంలోని బేగంపేట శివారులో నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News