President Of India: వేదిక దిగి మహిళా సెక్యూరిటీ గార్డుకు రాష్ట్రపతి పరామర్శ

  • మానవతను చాటుకున్న రాష్ట్రపతి 
  • నేషనల్ కార్పొరేట్ సామాజిక బాధ్యత అవార్డుల ప్రదానోత్సవంలో ఘటన
  • కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అనురాగ్ శర్మ పరామర్శ

జాతీయ గీతాలాపన సమయంలో ఓ మహిళా సెక్యూరిటీ గార్డు అనారోగ్యంతో కళ్లు తిరిగి పడిపోవడంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అనురాగ్ శర్మలు మానవీయ దృక్పథాన్ని ప్రదర్శించారు. ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్పొరేట్ సామాజిక బాధ్యత అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఘటన చోసుకుంది.  జాతీయ గీతాలాపన ముగిసిన తర్వాత వారు వేదిక దిగి సదరు మహిళ వద్దకు వచ్చి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మళ్లీ వారు వేదికపైకి చేరుకుని అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని కొనసాగించారు.



  • Loading...

More Telugu News