Road Accident: హైదరాబాద్ లో బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు

  • మూడు కార్లపైకి దూసుకెళ్లిన వైనం
  • బ్రేకులు విఫలం కావడమే కారణం
  • హబ్సిగూడలో ఘటన
  • కొత్తూరులోనూ ఓ బస్సు బీభత్సం

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో విధులు నిర్వహిస్తోన్న తాత్కాలిక డ్రైవర్లు.. ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడ సిగ్నల్‌ వద్ద ఓ తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్న బస్సు బ్రేకులు విఫలం కావడంతో అది మూడు కార్లపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో ఎనిమిది మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు.

ఆ బస్సు జేబీఎస్‌ నుంచి జనగామ వెళుతోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. మరోవైపు, రంగారెడ్డి జిల్లాలోనూ ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. కొత్తూరు మీదుగా వెళుతోన్న ఆ బస్సు రెండు కార్లను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆ బస్సు మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వెళుతోందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News