Chandrababu: రాజీనామా చేయడం సమస్యకు పరిష్కారం కాదు, వ్యక్తిగతంగా అండగా ఉంటా: వంశీకి లేఖ రాసిన చంద్రబాబు

  • టీడీపీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ
  • స్పందించిన చంద్రబాబు
  • సమస్యలకు ఎదురొడ్డి పోరాడలని హితవు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడంపై చంద్రబాబునాయుడు స్పందించారు. రాజీనామా చేయడం, రాజకీయాల నుంచి తప్పుకోవడం సమస్యకు పరిష్కారం కాదని హితవు పలికారు. ఈ మేరకు వంశీకి చంద్రబాబు లేఖ రాశారు. సమస్యలకు ఎదురు నిలిచి పోరాడాలని సూచించారు. వైసీపీపై పోరాటంలో అండగా ఉంటామని వంశీకి ఈ సందర్భంగా చంద్రబాబు భరోసా ఇచ్చారు. పార్టీపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై రాజ్యాంగ సంస్థలకు ఫిర్యాదు చేద్దామని సూచించారు.

  • Loading...

More Telugu News