Budda Venkanna: బిచ్చగాళ్ల దగ్గర చిల్లర కొట్టేసే నీకు అమరావతి విలువ ఏం తెలుస్తుంది?:  విజయసాయిపై బుద్ధా వ్యాఖ్యలు

  • విజయసాయిపై బుద్ధా ట్వీట్లు
  • అమరావతిని ఎడారిగా మార్చారంటూ విమర్శలు
  • వైసీపీ వైఖరిని రైతుల ముందుకొచ్చి చెప్పాలంటూ డిమాండ్

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. చంద్రబాబు గారు ఐదేళ్లు కష్టపడి అమరావతికి ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చారు, దాన్ని మీ తుగ్లక్ ముఖ్యమంత్రి 5 నెలల్లో నాశనం చేసి అమరావతిని ఎడారిగా మార్చేశారు అంటూ మండిపడ్డారు.

 అయినా బిచ్చగాళ్ల వద్ద చిల్లర కొట్టేసే నీకు అమరావతి విలువ ఏం తెలుస్తుందిలే అంటూ విజయసాయిని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించారు. "నీకే గనుక ధైర్యం ఉంటే రాజధానికి భూములిచ్చిన రైతుల ముందుకు వచ్చి మీ పార్టీ అమరావతికి అనుకూలమో కాదో చెప్పాలి, ఆపై మిగతా విషయాలు రైతులే చూసుకుంటారు" అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News