Telangana: తెలంగాణలో యువత నిర్లక్ష్యానికి గురవుతోంది: రేవంత్ రెడ్డి

  • ‘ఇంటికో ఉద్యోగం’ హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదు
  • తెలంగాణలో రాష్ట్ర యువజన కమిటీ  ఏర్పాటు చేయాలి
  • యువతకు సరైన దిశానిర్దేశం చేస్తే ఏదైనా సాధించగలరు

ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ మాటనిలబెట్టుకోలేదని, తెలంగాణ యువతను ఆయన మోసం చేశారని టీ-కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఓ బహిరంగం లేఖ రాశారు. తెలంగాణలో యువత నిర్లక్ష్యానికి గురవుతోందని, వారిలో నైపుణ్యాలను మెరుగుపరిచి వారికి సరైన దిశానిర్దేశం చేస్తే ఏదైనా సాధించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర యువజన కమిటీని ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News