Andhra Pradesh: తల్లిదండ్రులు అప్పుతీర్చలేదని రాజస్థాన్ నుంచి వచ్చి బాలుడ్ని కిడ్నాప్ చేసిన వడ్డీవ్యాపారి

  • రాజస్థాన్ లో అప్పుచేసిన తల్లిదండ్రులు
  • వడ్డీవ్యాపారి దురాగతం
  • బాలుడ్ని ఎత్తుకెళ్లిన వైనం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

తల్లిదండ్రులు చేసిన అప్పుకు వారి కుమారుడ్ని కిడ్నాప్ చేసిన ఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపుతోంది. రాజస్థాన్ నుంచి వచ్చిన వడ్డీవ్యాపారి మాయాఖాన్ బాలుడ్ని కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద పెనాలు విక్రయించే పూల్ భాయ్, సోనీ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. వీరు రాజస్థాన్ నుంచి వచ్చి ఆత్కూరులో స్థిరపడ్డారు.

అయితే, రాజస్థాన్ లో బాలుడి తల్లిదండ్రులు తన వద్ద అప్పు చేయగా, ఇంతవరకు అప్పుతీర్చలేదన్న కారణంతో మాయాఖాన్ కిడ్నాప్ కు ఒడిగట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడి కిడ్నాప్ పై ఆత్కూరు పీఎస్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. వడ్డీవ్యాపారి మాయాఖాన్ నుంచి బాలుడిని కాపాడేందుకు ఆత్కూరు పోలీసులు రాజస్థాన్ వెళ్లారు.

  • Loading...

More Telugu News