Sensex: వారాన్ని లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు

  • 164 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 58 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతంపైగా లాభపడ్డ యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను మూటగట్టుకున్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ స్టాకులు మార్కెట్లను లాభాల్లో నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 164 పాయింట్లు లాభపడి 37,145కి చేరుకుంది. నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 11,004 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (4.22%), మారుతి సుజుకీ (2.89%), ఎల్ అండ్ టీ (2.38%), భారతి ఎయిర్ టెల్ (2.36%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.98%).

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.50%), ఇన్ఫోసిస్ (-1.21%), బజాజ్ ఆటో (-1.16%), టాటా స్టీల్ (-0.93%), టెక్ మహీంద్రా (-0.92%).

  • Loading...

More Telugu News