Andhra Pradesh: ‘చంచల్ గూడ’ జైలు చిప్పకూడు కంటే దారుణమైన బియ్యం సరఫరా చేశారు!: బుద్ధా వెంకన్న

  • వైసీపీ నేతల కారుకూతల్ని ప్రజలు నమ్మారు
  • ‘లోటస్ పాండ్’ బియ్యం తినొచ్చని ఆశపడ్డారు
  • సన్నబియ్యం పథకంపై టీడీపీ నేత ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం నాణ్యమైన బియ్యం రేషన్ షాపుల ద్వారా ఇస్తుంటే టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. దీంతో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతల కారుకూతలు నమ్మిన ఏపీ ప్రజలు జగన్ లోటస్ పాండ్ లో తినే బియ్యమే సరఫరా చేస్తాడనుకుని సంబరపడ్డారని బుద్ధా వెంకన్న తెలిపారు.

కానీ 16 నెలలు చంచల్ గూడ జైలులో సాయిరెడ్డి, ఆయన బాస్ తిన్న చిప్పకూడు కంటే దారుణమైన బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి నాణ్యతలేని బియ్యాన్ని సరఫరా చేసి ఈరోజున నాణ్యమైన బియ్యం ఇచ్చామని ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన బుద్ధా వెంకన్న.. నాణ్యతలేని బియ్యానికి సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Telugudesam
budda venkanna
Twitter
Sanna biyyam
Ration shops
Civil supplies
  • Error fetching data: Network response was not ok

More Telugu News