Andhra Pradesh: ‘హెరిటేజ్’ కోసం ఏపీ డెయిరీని నాశనం చేసిన చరిత్ర చంద్రబాబుది!: విజయసాయిరెడ్డి

  • కమీషన్లు దండుకున్న బతుకు ఆయనది
  • జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు
  • దీంతో బాబు కక్కలేక, మింగలేక ఇబ్బంది పడుతున్నారు

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే చంద్రబాబు కక్కలేక, మింగలేక తంటాలు పడుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి కమిషన్లు దండుకున్న బతుకు చంద్రబాబుదని ఆయన ఎద్దేవా చేశారు.

హెరిటేజ్ కోసం చంద్రబాబు ఏపీ డెయిరీని నాశనం చేశారని ఆరోపించారు. చంద్రబాబు 40 సంవత్సరాల పాటు తన కుటుంబం, సొంత మనుషుల కోసమే ఆరాటపడ్డారని దుయ్యబట్టారు. ఈ మేరకు ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి చంద్రబాబు, నారా లోకేశ్ లను ట్యాగ్ చేశారు.

Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Telugudesam
Chandrababu
Nara Lokesh
Twitter
Heritage
Ap dairy
  • Error fetching data: Network response was not ok

More Telugu News