Krishna District: కృష్ణా జిల్లాలో పంట పొలాల్లోకి బోల్తా కొట్టిన ఆర్టీసీ బస్సు

  • విజయవాడ నుంచి అవనిగడ్డ వెళుతున్న ఆర్టీసీ బస్సు
  • చోడవరం వద్ద బస్సుపై నియంత్రణ కోల్పోయిన డ్రైవర్
  • 15 మందికి గాయాలు

కృష్ణా జిల్లాలో ఇవాళ ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి అవనిగడ్డ వెళుతున్న బస్సు పెనమలూరు మండలం చోడవరం వద్దకు రాగానే ఒక్కసారిగా డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దాంతో పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు సామర్థ్యం మేర ప్రయాణికులు ఉన్నారు.

  • Loading...

More Telugu News