Rapaka Varaprasad: జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై కేసు నమోదు

  • మలికిపురంలో పేకాడుతున్న వారిని అరెస్ట్ చేసిన ఎస్సై
  • అనుచరులతో కలసి ఎస్సైతో ఘర్షణ పడ్డ రాపాక
  • రాళ్లు రువ్వడంతో పగిలిన స్టేషన్ కిటికీ అద్దాలు

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం నిన్న రాత్రి ఓ ప్రకటనను విడుదల చేశారు. పేకాడుతున్నవారికి వత్తాసు పలకడమే కాకుండా, పోలీస్ స్టేషన్ పై దౌర్జన్యం చేసి, ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారనే అభియోగాలను పోలీసులు నమోదు చేశారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే, మలికిపురంలో పేకాడుతున్న 9 మందిని స్థానిక ఎస్సై కేవీ రామారావు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో, వారిని విడిచి పెట్టాలని రాపాక వరప్రసాద్, అతని అనుచరులు ఎస్సైతో ఘర్షణ పడ్డారు. పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సుమారు 100 మంది కలసి పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వి, కిటికీ అద్దాలు పగలగొట్టారని తెలిపారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అన్నారు.

ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. రాపాక వరప్రసాద్ పై గతంలో రెండు కేసులు ఉన్నాయని చెప్పారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని... ఎంతటి వారైనా చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Rapaka Varaprasad
Janasena
MLA
Case
  • Loading...

More Telugu News