Pawan Kalyan: పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ ఖరారు

  • ఈ నెల 4న రాజమండ్రి రాక
  • పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం
  • కేన్సర్ తో మరణించిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 4,5 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి సిద్ధాంతం, పెనుగొండ మీదుగా భీమవరం వెళతారు. అదే రోజు సాయంత్రం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. ఆ మరుసటి రోజు నరసాపురం పార్లమెంటరీ స్థానం పరిధిలో కార్యకర్తలతో ముఖాముఖిలో పాల్గొంటారు. ముఖ్యంగా, ఇటీవల కేన్సర్ వ్యాధితో మరణించిన పార్టీ కార్యకర్త మురళీకృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.

  • Loading...

More Telugu News