Chandrababu: చిరుద్యోగులు ఉద్యోగ భద్రత కోసం రోడ్డెక్కి పోరాడాల్సిరావడం దురదృష్టకరం: చంద్రబాబు

  • గత ఐదేళ్లలో ఇలాంటి నిరసనలు లేవన్న మాజీ సీఎం
  • అందరి సంక్షేమమే పరమావధిగా పనిచేశామంటూ ట్వీట్
  • చిరుద్యోగులకు టీడీపీ తోడుగా నిలుస్తుందని వెల్లడి

ఇటీవల కాలంలో రాష్ట్రంలో చిరుద్యోగులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తుండడం మీడియాలో తరచుగా కనిపిస్తోంది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గత ఐదేళ్లలో చిరు వేతన జీవులు ఈ విధంగా ఎప్పుడూ రోడ్డెక్కలేదని పేర్కొన్నారు. తమకు వీలైనంతగా అందరి సంక్షేమమే పరమావధిగా పనిచేశామని, కానీ ఇప్పుడు చిరుద్యోగులు తమ ఉద్యోగాలను కాపాడుకోవడం కోసం పోరాటాలు చేయాల్సిరావడం దురదృష్టకరమని ట్వీట్ చేశారు. వారి పోరాటంలో తాము తోడుగా నిలుస్తామని చెబుతూ సంఘీభావం ప్రకటించారు.

  • Loading...

More Telugu News