Shahid Kapoor: 40 కోట్లకి పారితోషికం పెంచేసిన బాలీవుడ్ హీరో

  • భారీ విజయాన్ని సాధించిన 'కబీర్ సింగ్
  • 'జెర్సీ' హిందీ రీమేక్ కి సన్నాహాలు
  • భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిన షాహిద్  

తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో తెరకెక్కించారు. షాహిద్ కపూర్ ఈ సినిమాలో కథానాయకుడిగా చేశాడు. ఇటీవలే ఈ సినిమా అక్కడ విడుదలై భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలివారంలో 130 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ప్రస్తుతం 300 కోట్ల క్లబ్ కి చేరువలో వుంది.

ఈ నేపథ్యంలో తెలుగులో విజయాన్ని సొంతం చేసుకున్న 'జెర్సీ' సినిమాను కూడా హిందీలో తీయడానికి నిర్మాతలు రంగంలోకి దిగారు. హిందీ రీమేక్ రైట్స్ ను 30 కోట్లకి దక్కించుకున్న నిర్మాతలు, షాహిద్ కపూర్ ను సంప్రదించారట. ఈ సినిమా చేయడానికిగాను ఆయన 40 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టుగా సమాచారం. 'కబీర్ సింగ్' హిట్ తో ఆయన ఒక రేంజ్ లో పారితోషికం పెంచేయడంతో ఆలోచనలో పడిన నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

  • Loading...

More Telugu News