Andhra Pradesh: మేం తాళపత్రాలు విడుదలచేస్తే మీ తాతలనాటి మోసాలు, పాపాలు బయటపడతాయ్!: బుద్ధా వెంకన్న వార్నింగ్

  • టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం
  • చంద్రబాబును ప్రజలు నమ్మరన్న విజయసాయిరెడ్డి
  • ఎవరిని నమ్మరో దేశమంతటికీ తెలిసిందన్న బుద్ధా 

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ట్విట్టర్ లో మాటలయుద్ధం సాగుతోంది. చంద్రబాబు ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేసినా, చివరికి తాళపత్రాలు విడుదల చేసినా ఆయన్ను ప్రజలు నమ్మరని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈరోజు విమర్శించారు. తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తిప్పికొట్టారు. చంద్రబాబు హయాంలో అప్పు ఇస్తామని ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై నమ్మకంలేక వెనక్కు పోతున్నాయని విమర్శించారు.

ఏపీలో ఎవరు ఎవరిని నమ్మే పరిస్థితి ఉందో ప్రస్తుతం దేశానికి అంతా తెలుసని వ్యాఖ్యానించారు. ‘బహుశా మీ నాయకుడి(జగన్)పై, మీపై ఉన్న సీబీఐ కేసు పత్రాలు చదివి ఉంటారేమో! మేము మీ తాళపత్రాలు విడుదల చేస్తే మీ తాతలనాటి నుంచి మీ వరకు మోసాలు, పాపాలు బయటపడతాయి. కాబట్టి మీ నోటికి తాళం వేసుకు కూర్చుంటే మంచిది’ అని హితవు పలికారు. ఈ మేరకు బుద్దా వెంకన్న ట్వీట్లు చేశారు.

  • Loading...

More Telugu News