West Godavari District: విజ్జేశ్వరం వద్ద నీట మునిగిన కారు!

  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
  • అదుపుతప్పి నీటిలో పడిపోయిన కారు
  • గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద, అదుపుతప్పిన ఓ కారు, రోడ్డు పక్కన రక్షణగా ఏర్పాటు చేసిన దిమ్మెను ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కారు పూర్తిగా నీటమునిగింది. ఈ ఘటనను చూసిన స్థానికులు, కారులో ఎంతమంది ఉన్నారో తమకు తెలియదని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కాలువలో నీటి ప్రవాహాన్ని తగ్గించి, గాలింపు చర్యలను ప్రారంభించారు. ఈ కారులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి వరకూ ఉండవచ్చని భావిస్తుండగా, వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News