Samantha: దుమ్మురేపేస్తోన్న 'ఓ బేబీ' .. 3 రోజుల వసూళ్లు

  • ఈ నెల 5న థియేటర్లకు వచ్చిన 'ఓ బేబీ'
  • 3 రోజుల్లో 17 కోట్ల గ్రాస్ వసూలు
  •  ఖుషీ అవుతోన్న సమంత అభిమానులు

సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఓ బేబీ' .. ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా, తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. నటన పరంగా సమంత ఫుల్ మార్కులు కొట్టేసింది. మౌత్ టాక్ కారణంగా ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. అలా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో ఈ సినిమా 17 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో, ఈ వారాంతం వరకూ ఈ సినిమా వసూళ్ల పరంగా తన జోరును చూపించే అవకాశాలు వున్నాయి. 'రంగస్థలం' .. 'మజిలీ' తరువాత 'ఓ బేబీతో సమంతకి మరో హిట్ పడటంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

  • Loading...

More Telugu News