sensex: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 130 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 45 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • ఏడున్నర శాతం పైగా నష్టపోయిన యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ప్రారంభం నుంచి ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలు... చివరి గంటలో లాభాల బాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 130 పాయింట్లు లాభపడి 39,816కి పెరిగింది. నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకుని 11,910కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (2.89%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.50%), భారతి ఎయిర్ టెల్ (1.43%), ఇన్ఫోసిస్ (1.20%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.93%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-7.60%), టాటా మోటార్స్ (-2.47%), సన్ ఫార్మా (-2.36%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.17%), బజాజ్ ఆటో (-1.00%).

  • Loading...

More Telugu News