Toss: టాస్ గెలిచిన టీమిండియా.... ముగ్గురు వికెట్ కీపర్లతో బరిలోకి!

  • బర్మింగ్ హామ్ లో బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • జాదవ్ స్థానంలో దినేశ్ కార్తీక్ కు చోటు
  • కుల్దీప్ బదులు భువనేశ్వర్ కుమార్

బంగ్లాదేశ్ తో కీలక వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో ఓటమి నేపథ్యంలో, ఈ మ్యాచ్ లో విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. కాగా, బర్మింగ్ హామ్ మైదానంలో ఓవైపు బౌండరీ చిన్నదిగా ఉండడంతో ఒక స్పిన్నర్ ను తప్పించాలని టీమిండియా నిర్ణయించుకుంది. కుల్ దీప్ యాదవ్ ను పక్కనబెట్టి ఫిట్ నెస్ నిరూపించుకున్న భువనేశ్వర్ యాదవ్ కు తుదిజట్టులో చోటు కల్పించారు.

ఇక, ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా భారీ షాట్లు ఆడేందుకు బాగా ఇబ్బందిపడిన కేదార్ జాదవ్ కు బంగ్లాదేశ్ తో ఆడే తుదిజట్టులో స్థానం దక్కలేదు. జాదవ్ స్థానంలో దినేశ్ కార్తీక్ జట్టులోకి వచ్చాడు. దినేశ్ కార్తీక్ రాకతో టీమిండియాలో ముగ్గురు వికెట్ కీపర్లకు స్థానం దక్కినట్టయింది. ఇప్పటికే ధోనీ, పంత్ ఆడుతుండగా, వాళ్లకు తోడు డీకే కూడా ఎంటరయ్యాడు. ఇక, బంగ్లాదేశ్ విషయానికొస్తే, కీలక ఆటగాడు మహ్మదుల్లా ఫిట్ నెస్ నిరూపించుకోలేకపోవడంతో షబ్బీర్ రెహ్మాన్ కు అవకాశం లభించింది.

  • Loading...

More Telugu News