lathasri: అమ్మ లేకపోవడంతో అంతా శూన్యమైపోయింది: నటి లతాశ్రీ

  • అన్ని విషయాలు అమ్మే చూసుకునేది
  • లోకం తీరు తెలియకుండా పోయింది
  • బంధువుల వలన నష్టపోయానన్న లతాశ్రీ 

నటిగా పలు చిత్రాలలో నటించి మెప్పించిన లతాశ్రీ, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తన తల్లిని గురించి ప్రస్తావించారు. "చిన్నవయసులోనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అందువలన అప్పటి నుంచి అమ్మ నా వెంటనే ఉంటూ వచ్చింది. నా సినిమాలకి సంబంధించిన అన్ని విషయాలను అమ్మే చూసుకునేది.

ఎవరితోనూ ఆమె ఎక్కువగా మాట్లాడనిచ్చేది కాదు. దాంతో బయట ప్రపంచం ఎలా వుంటుందనే విషయం నాకు తెలియకుండా పోయింది. ఎవరు మంచి .. ఎవరు చెడు అని గ్రహించలేకపోయాను. అమ్మ చనిపోవడంతో .. ఒక్కసారిగా అంతా శూన్యమైపోయింది. అంతగా తనపై ఆధారపడొద్దని అమ్మ అంటూనే ఉండేది. కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. అమ్మ చనిపోయిన తరువాత బంధువులను నమ్మేసి నష్టపోయాను కూడా. అమ్మ .. అమ్మనే .. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News