chandrababu: చట్ట పరిధిలోనే చంద్రబాబుకు భద్రతను కేటాయించాం: ఏపీ హోం మంత్రి సుచరిత

  • టీడీపీ నేతల ఆరోపణలకు మంత్రి స్పందన
  • భద్రతా సమీక్ష కమిటీ దీన్ని నిర్ణయిస్తుంది
  • కక్ష పూరితంగా మేము నిర్ణయం తీసుకోలేదు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ ప్రభుత్వం భద్రతను కుదించిన సంగతి తెలిసిందే. జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉండే చంద్రబాబుకు భద్రతను ఎలా తగ్గిస్తారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ఏపీ హోం మంత్రి సుచరిత స్పందించారు. చంద్రబాబుకు చట్ట పరిధిలోనే భద్రతను కేటాయించామని చెప్పారు. ఏ స్థాయి వ్యక్తులకు ఎంత భద్రత కల్పించాలనేది భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. కక్ష పూరితంగా తాము నిర్ణయం తీసుకోలేదని... ఈ అంశాన్ని కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News