Andhra Pradesh: చంద్రబాబు ఇంటికి నోటీసుల వ్యవహారం.. సీఆర్డీఏ కంటే ముందే గెస్ట్ హౌస్ ఉందన్న యనమల!

  • చంద్రబాబుపై కక్ష సాధించే ఆలోచనలోనే ఉన్నారు
  • లీగల్ అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలించట్లేదు
  • కోర్టులో కేసు ఉండగా కూల్చివేత నోటీసు ఇస్తారా?

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఉంటున్న నివాసానికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు అంటించిన సంగతి తెలిసిందే. కృష్ణానదికి 100 మీటర్ల సమీపంలో ఈ భవనం కట్టడంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. ‘వీళ్ల ఆత్రుత చూస్తాఉంటే చంద్రబాబు నాయుడి మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలన్న ఆలోచనలోనే వీరు ఉన్నారనిపిస్తోంది.

ఈ వ్యవహారంలో లీగల్ అంశాలను కూడా పరిశీలించలేదు. లింగమనేని గెస్ట్ హౌస్ ను పంచాయతీ పర్మిషన్ తో కట్టారు. అనుమతి లేకుండా కట్టలేదు. అమరావతి అన్నది పంచాయతీ ఏరియా. అక్కడ రాజధాని వచ్చాక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఓ పిల్ వేశాడు. ఈ అక్రమ కట్టడాలను కూల్చేయాలని పిటిషన్ వేశారు. దానిపై ఇంకా తీర్పు రాలేదు. ఇలా కోర్టులో కేసు ఉన్నప్పుడు బిల్డింగ్ కూల్చివేతకు నోటీసులు ఎలా ఇస్తారు? లింగమనేని బిల్డింగ్ కట్టినప్పుడు సీఆర్డీఏనే లేదు’ అని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Yanamala
crda
GUEST HOUSE
  • Loading...

More Telugu News