Jagan: బెరం పార్కులో అధికారులకు ప్రభుత్వ విందు... సతీసమేతంగా పాల్గొన్న సీఎం జగన్

  • జిల్లా కలెక్టర్లతో సమావేశమైన సీఎం
  • ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు విందు
  • విందు అనంతరం తాడేపల్లి నివాసానికి వెళ్లిన జగన్

ఏపీ సీఎం జగన్ ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నవరత్నాల అమలే ప్రధాన అజెండాగా సాగిన ఈ సమావేశంలో జగన్ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం విజయవాడలోని బెరం పార్కులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ప్రభుత్వం తరఫున విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో సీఎం జగన్ సతీసమేతంగా పాల్గొన్నారు. రాష్ట్ర యంత్రాంగంలో భాగంగా ఉన్న ఆ అధికార గణంతో జగన్ ఉల్లాసంగా గడిపారు. విందు అనంతరం జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News