Andhra Pradesh: చిన్నారులను ఒళ్లో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించిన సీఎం జగన్!

  • తాడేపల్లిలోని పెనుమాకలో రాజన్న బడిబాట
  • పాల్గొన్న సీఎం జగన్, విద్యాశాఖ మంత్రి సురేష్
  • చిన్నారులను ఆశీర్వదించిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తాడేపల్లి మండలంలోని పెనుమాక జెడ్పీ పాఠశాలలో ఈరోజు చేపట్టిన ‘రాజన్న బడిబాట కార్యక్రమంలో’ ఏపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులను ఆశీర్వదించిన జగన్ ఓ బాలుడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించారు.

అనంతరం మరికొందరు చిన్నారుల చేత కూడా పలక, బలపం పట్టించి అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు. పాఠశాలలపై చిన్నారులకు భయం పోగొట్టేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం ఈనెల 12 నుంచి 15 వరకూ రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది.

  • Loading...

More Telugu News